కాగ్ ఏమైనా ‘భగవద్గీతా’నా..!

CM-Kiran1కాగ్ ఇచ్చిన నివేదిక బైబిల్, ఖురాన్, భగవద్గీత కాదంటూ.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ తీవ్ర వ్యాఖ్యలు. శాసన సభలో విద్యుత్ సమస్యపై చేపట్టిన స్పల్పకాల చర్చ సందర్భంగా.. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. కాగ్ నివేదికను ప్రస్తావించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఇదే మాట చెబుతామని ఆయన అన్నారు. ఇతర ప్రాజెక్టుల కన్నా జెన్ కో ధర ఎక్కువని కాగ్ నివేదిక ఇచ్చిందని సీఎం అన్నారు. టీడీపీ హయాంలో శ్రీశైలం పనుల్లో అక్రమాలు జరిగాయని కాగ్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కాగా, కాగ్ నివేదికను ప్రవిత్ర గంథ్రాలైన భగవద్గీత, ఖురన్, బైబిల్ లతో సీఎం పోల్చడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నారు