క్లారిటీ ఇస్తారా ?

pm mamonhnఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. కాగా టేబుల్ అయిటెంగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 కేబినెట్ ముందుకు రానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, రాయల తెలంగాణ, విభజన నేపధ్యంలో హైదరాబాద్ పరిస్థితి పై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈ కేబినెట్ భేటీలో మన రాష్ట్రానికి కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి,పళ్లం రాజు, కావూరి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్ లు పాల్గొంటున్నారు.