బిల్లులోని ముఖ్యాంశాలు :
* 10 జిల్లాల తెలంగాణ, 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్
* భద్రాచాలం డివిజన్, మునగాల తెలంగాణలోనే.
* పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా జీహెచ్ ఎంసీ
*తెలంగాణకు 119 మంది ఎమ్మెల్యేలు, 40మంది ఎమ్మెల్సీలు, 17లోక్ సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు
* ఆంధ్ర ప్రదేశ్ కు 175 మంది ఎమ్మెల్యేలు, 50మంది ఎమ్మెల్సీలు, 25లోక్ సభ, 11 రాజ్యసభ సభ్యులు
* రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్, కేంద్రం నియమించే ఇద్దరు సలహాదారులు గవర్నర్కు సహకరిస్తారు.
* కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ఇప్పుడు వున్న హైకోర్టే ఉమ్మడిగా పనిచేస్తుంది.
* ఏపీపీఎస్సీ ఆంధ్రపదేశ్ కు చెందుతుంది. తెలంగాణ కోసం కొత్త పబ్లిక్ సర్వీస్ ను ఏర్పాటు చేస్తారు.
* జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పల పంపిణీ
* అఖిల భారత సర్వీసుల కేడర్ 2రాష్ట్రల మధ్య విభజన
* కృష్ణా గోదావరి నదుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రెండు ప్రత్యేక బోర్డుల ఏర్పాటు. కేంద్ర జనవనరుల మంత్రి, రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల నేతృత్వంలోని సర్వోన్నత మండలి ఈ బోర్డులను పర్యవేక్షిస్తుంది.
* 371డి రెండు రాష్ట్రాలో అమలులో వుంటుంది.
* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజదాని అన్వేషణ కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు. కొత్త రాష్ట్ర ఏర్పాటు చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల లోపు ఇది నివేదికను అందిస్తుంది.
* రెండు రాష్ట్రాల్లోను పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తోంది.
* వచ్చే పదేళ్లలో అంటే.. 12, 13 పంచవర్ష ప్రణాళికలలో ఆంధ్రప్రదేశ్ లో ఐఐటీ, ఎన్ ఐటీ, ఐఐఎం, ఐఐఎన్ ఈఆర్, కేంద్ర విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ ఏర్పాటు
* ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బోధనా కేంద్రం నిర్మాణం.