బైరెడ్డి ఆత్మ గౌరవ దీక్ష.. !

Byreddyరాష్ట్ర విభజన అంశంపై.. రాయలసీమలో అప్పుడే వేడి రాజుకుంది. కేంద్రం రాయల తెలంగాణను ప్రతిపాదిస్తోందని వస్తోన్న వార్తల నేపథ్యంలో.. రాయలసీమ అస్థిత్వాన్ని, ఉనికిని కాపాడుకోవడానికి రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆత్మ గౌరవ దీక్షను చేపట్టారు. ’ప్రత్యేక రాయలసీమ’ రాష్ట్ర సాధన కోసం బైరెడ్డి ఇందిరా పార్క్ వద్ద 52 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. రాయలసీమ విభజనకు తాము అంగీకరించేది లేదని.. ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

రాయల తెలంగాణ పేరుతో.. సీమ ప్రాంతాన్ని రెండుగా చీల్చాలని చూస్తే రాయలసీమ ప్రజలు తిరగబడతారని రాయలసీమ జేఏసీ హెచ్చరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా రాయలసీమ జేఏసీ నేతలు కూడా దీక్షలో పాల్గొన్నారు. రాయలసీమ ఎమ్మెల్యేలు విభజనపై ఎందుకు మాట్లాడటం లేదని బైరెడ్డి సూటిగా ప్రశ్నించారు.