Site icon TeluguMirchi.com

మద్యం తాగి రోజా ప్రెస్ మీట్స్

వైసీపీ ఫైర్ బ్రాండ్’గా పేరుతెచ్చుకొంది ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా. ఆమె మైకు అందుకుంటే రచ్చ రచ్చే. ఇప్పుడు సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రోజాపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది అధికార టీడీపీ. ఆమె ఏం మాట్లాడినా.. టీడీపీ నేతలు గుంపుగా ఎటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజాపై పార్ట్ టైం ఎమ్మెల్యే ట్యాగ్ తగిలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, టీడీపీ నేత బుద్దా వెంకన్న రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘మద్యం తాగి రోజా ప్రెస్ మీట్స్ పెడుతోంది. అందువలన ఆమె ఇష్టానుసారం మాట్లాడుతుంది. కావాలంటే.. ఈసారి రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టెస్ట్ చేయండి. ఆ టెస్ట్ ల్లో తేలిపోతుంది’ అంటున్నాడు బుద్దా. మహిళా లోకం ఇబ్బంది పడేలా మాట్లాడటం రోజారెడ్డికి అలవాటైపోయిందని విమర్శించారు. బుద్దా కామెంట్స్ విని మీడియా ప్రతినిధులు నవ్వుకొంటున్నారు. ఈసారి రోజా ప్రెస్ మీట్ పెట్టినట్టు నిజంగానే టెస్ట్ చేద్దామని సరదాగా చెప్పుకొంటున్నారు.

Exit mobile version