Site icon TeluguMirchi.com

గవర్నర్ ను కలవనున్న బాబు !

chandrababu-naidu-295తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) రాష్ర్ట గవర్నర్ ను కలవనున్నారు. అవినీతి మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని బాబు గవర్నర్ ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి బాబు గవర్నర్ వద్దకు వెళ్లనున్నారని సమాచారం. కాగా, కేంద్ర కేబినెట్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే మంత్రి, పవన్ కుమార్ బన్సల్, న్యాయ శాఖమంత్రి అశ్విన్ కుమార్ లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ర్టంలో మంత్రుల్లో సీబీఐ ఛార్జీషీట్ లో ఉన్న మంత్రులు ఇంకా తమ తమ పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు. గతకొద్దికాలంగా ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా అవినీతి మంత్రులను తొలగించాల్సిందేనని పట్టుబడుతోంది. ఇటు ప్రతిపక్షాలతో పాటుగా.. సొంత పార్టీ నాయకులు విహె. హనుమంతరావు, శంకర్రావు లాంటి సీనియర్ నాయకులు కూడా అవినీతి మంత్రుల విషయంలో ఒంటికాలుపై లేస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో అధిష్టానం రాష్ర్ట అవినీతి మంత్రులపై కూడా వేటు వేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version