ఇందిరమ్మ.. ఇంటికి లక్ష : బొత్స

botsaసీఎం కిరణ్ మాత్రమే.. కాదందోయ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా వరాలు గుప్పించగలడు. విజయనగరం జిల్లా గరివిడి, మెరకముడిదాం మండలాల్లో ఈరోజు బొత్స పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా అందరికి అనుకుంటే పొరపాటే అవుతుంది. కేవలం ఎస్సీలకు మాత్రమే. ఇంతకు ముందు ఇచ్చే 65 వేలను కాస్త లక్ష రూపాయాలుగా చేస్తామని బొత్స వెల్లడించారు. కాగా, బొత్స జిల్లా పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలకు శంకుస్థాన చేశారు. రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడమే కాదు.. ఎన్నికలకు ముందు ప్రజలకు వరాలు ప్రకటించడంలో కూడా ముందుండాలని పీపీసీ ఛీఫ్ గ్రహించి వుంటారని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.