Site icon TeluguMirchi.com

సీఎంకు సత్తిబాబు బాసట !

bostaరాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ కొత్త అర్థం చెప్పారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, కేవలం పునరాలోచన చేయాలని మాత్రమే కోరారని సత్తిబాబు చెప్పుకొచ్చారు. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రితో ఎప్పుడూ.. విభేధించి ఆయనను ఇరుకున పెట్టాలనే భావించే సత్తిబాబు సీఎంకు బాసటగా నిలవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీయైన వివరాలను వివరిస్తూ..  తాను సీమాంద్ర ప్రజల ఉద్యమం, వారు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దిగ్విజయ్ సింగ్ కు వివరించానని చెప్పారు. సత్వరమే ఆంటోని కమిటీని రాష్ట్రానికి రావాలని కోరానని బొత్స తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రధాని అభర్థి అయిన మోడీతో కలిసి వేదిక పంచుకోవడం ఆయన ఇష్టం సత్తిబాబు అన్నారు.

Exit mobile version