Site icon TeluguMirchi.com

నాలుగైదు జిల్లాల్లో కాంగ్రెస్ కు పంచ్ !

botsaతొలివిడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలను గెలుచుకుందని పీసీసీ చీఫ్ బొత్స తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బొత్స విలేకర్లతో మాట్లాడుతూ.. నాలుగైదు జిల్లాలలో కాంగ్రెస్ బలహీనపడినట్లుగా కనబడుతోందని.. వాటిలో చిత్తూరు జిల్లా కూడా ఉందని పేర్కొన్నారు. బలహీనంగా ఉన్న జిల్లాలను పరిశీలించవలసి వుందని ఆయన అన్నారు. అయితే, పంచాయతీ ఎన్నికలో టిడిపి సీట్ల సంఖ్యను తారుమారు చేస్తోందని, వాపు ను చూసి బలుపు అనుకుంటున్నదని బొత్స వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలకు ముందు మరింత మంచి పాలనను అందించి 2014లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ఆయన అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు బొత్స ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజనకు ఈ పంచాయితీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని బొత్స పేర్కొన్నారు.

Exit mobile version