Site icon TeluguMirchi.com

అజాద్ తో బొత్స భేటీ !

botsa-meeting-with-azadముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ హస్తినా చేరుకున్నారు. ఢిల్లీ చేరుకోగానే పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాంనబీ అజాద్ తో భేటీ అయ్యారు. కళంకిత మంత్రులు, తెలంగాణ ఎంపీల వ్యవహారంతో పాటు పలు అంశాలపై నేతలు ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.కాగా, సీఎం కిరణ్ రేపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జ్ గులాంనబీ అజాద్ తో సమావేశం కానున్నారు. రాష్ర్టంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు తెలంగాణ తదితర అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version