కిరణ్ కు బొత్స లేఖాస్త్రం

kiran botsaముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణలకు మద్య వైరం మరింత ముదురుతోంది. ఈవరుసలొ సీఎం కిరణ్ పై బొత్స తన అసంతృప్తిని ప్రదర్శిస్తూ ఓ లేఖ రాశారు కంతేటి, నంది ఎల్లయ్య, రత్నాబాయిలను ఎమ్మెల్సీలు నియమించాలని పార్టీ ఆదేశిస్తే ఆ ఆదేశాలను పక్కన బెట్టడం ఎంతవరకు సమంజసం అని సీఎంను ప్రశ్నించారు. అంతేగాకుండా రంగారెడ్డి, రెడ్డప్పరెడ్డిలను శాసనమండలి విప్ లుగా నియమంచడం సముచితం కాదన్నారు. తద్వారా బడుగుబలహీన వర్గాలను పక్కనబెట్టినట్టయిందని విమర్శించారు.