Site icon TeluguMirchi.com

బొత్స ఢిల్లీ పయనం..!

Botsaపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు (బుధవారం) ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లాడు. కేంద్ర మంత్రి చిరంజీవి ఇంట్లో నిన్న బొత్స, ఆనం, రఘువీరా సమావేశమై సమాలోచనలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతకొద్ది కాలంగా అసమ్మతి నేతలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. సీఎం కిరణ్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని అసమ్మతి నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. బొత్స వారి ఢిలీ టూర్ అసమ్మతి నేతల గళం అధిష్టానం వద్ద వినిపించడానికేనా.. లేదా పార్టీ కార్యకలాపాల్లో భాగమేనా.. తెలియాల్సివుంది.

Exit mobile version