ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశాం

botsaరాష్ట్రానికి సమైక్యంగా వుంచాలని డిమాండ్ చేస్తూ.. గత అర్థ రాత్రి నుంచి ఏపీ ఎన్జీవోలు నిరవధిక సమ్మె తలపెట్టిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్దితో ఈరోజు ఉదయం బొత్స సమావేశమయి సీమాంధ్రలో చెలరేగుతున్న ఆందోళనపై చర్చించారు. అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్రలో ఉద్యోగులు సంయనం పాటించాలని కోరారు. ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సమ్మె ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చారు.