ఉభయ సభలు వాయిదా!!

telangana bill in parlimentతెలంగాణ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్నాయి. నేడు లోక్ సభకు విభజన బిల్లు వస్తుందన్న నేపథ్యంలో.. సీమాంధ్ర నేతలు తమ నిరసనలను మరింత ఉదృతం చేశారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభలో సీమాంధ్ర నేతలు జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. నేతల నిరసనతో.. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో.. స్వీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. మరోవైపు, రాజ్యసభలోను సేమ్ సీన్ నెలకొంది.