పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు టెన్ జన్పథ్లో పరాభవం ఎదురైంది. సోనియా అధికారిక నివాసం ’10 జన్ పథ్’ లో ఈ ఉదయం ఆహారభద్రత అంశంపై వివిధ రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి బొత్సకు అనుమతి నిరాకరించారు. మేడమ్ తనను ఫోన్ చేసి పిలిచారని బొత్స వివరించినా.. అక్కడి భద్రత సిబ్బంది ఆయనను సమావేశానికి వెళ్లడానికి అనుమతిని ఇవ్వలేదు. దీంతో చేసేది లేక కాసేపు అక్కడే ఉండి బొత్స తిరుగు పయనమయ్యారు. అయినా పిలువని పేరంటానికి వెళితే.. ఇలానే ఉంటుందని కొందరు రాజకీయనాయకులు గుసగుసలాడుతున్నట్లు సమాచారం.