తెలుగు దేశం ఎమ్మెల్యే చెవులో పువ్వు పెట్టాడు..

umaఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం గత కొన్ని రోజులుగా ఊరు, వాడ తమ నిరసనలతో హోరెత్తేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రతినిధులు సైతం బీజేపీ వైఖరి ఫై మండిపడుతున్నారు. ఇక తెలుగు దేశం ఎమ్మెల్యే బోండా ఉమ ఒక్క అడుగు ముందుకు వేసి కేంద్రం ఫై వినూత్న రీతిలో తన నిరసనను తెలిపాడు.

చెవిలో పువ్వులు పెట్టుకుని కార్లు, బైక్ లు కడుగుతూ నిరసన తెలిపాడు. విభజన హామీలను బిజెపి నెరవేర్చడం లేదని, పోలవరం ప్రాజెక్ట్ కు కేవలం 800 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపాడు. హోదా ఫై ఇంకా ఆలస్యం చేస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రోడ్లు ఎక్కడం ఖాయమని కేంద్రాన్ని హెచ్చరించారు.