భాజపా దీక్ష భగ్నం..!

BJP-agitation-on-power-cutsవిద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, కరెంట్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. నాలుగు రోజులుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భాజాపా ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహార దీక్షను మంగళవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. అనంతరం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా.. దీక్షలో కూర్చున్న మిగతా నాయకులను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీక్షను విరమించే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే.. కాంగ్రెస్ కు రాష్ర్టంలో పుట్టగతులుండవని ఆయన అన్నారు. ఇందిరమ్మ బాటలో ఉన్న ముఖ్యమంత్రి అట్నుంచి అటే ఇంటిబాట పట్టడం ఖాయం కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు విద్యుత్ కోతలను నిరసిస్తూ.. మంగళవారం బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో.. యువమోర్చా కార్యకర్తలు సచివాలయంలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు.