ఏం సాధించారని సంబరాలు ?

ARUN_JAITLEYయూపీఏ పై మరో సారి నిప్పులు చెరిగారు బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ. తొమ్మిదేళ్ళ యూపీఏ పాలన ముగిసిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటోన్న కాంగ్రెస్‌పార్టీ.. ‘అసలు ఏం సాదించిదని సంబరాలు జరుపుకుంటోందని ప్రశ్నించారు. సీబీఐ సహకారంతో ఇతర రాజకీయ పార్టీలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందని, తొమ్మిదేళ్ళ అధికారంలో కొనసాగేందుకు యూపీఏ ప్రభుత్వం సీబీఐని వినియోగించుకుంటోందని తెలిపారు. మన్మోహన్‌సింగ్ వంటి బలహీనమైన ప్రధాన మంత్రిని దేశ ప్రజలు ఇంతకు ముందెన్నడూ చూడలేదని, అసలు ఏ ప్రధాన మంత్రి హయంలో జరగనంత అవినీతి మన్మోహన్ హయంలోనే జరిగిందని మండిపడ్డారు. భారీ కుంభకోణాలతో యూపీఏ ప్రభుత్వం మసక బారిందని ఎద్దేవా చేశారు. మన్మోహన్‌సింగ్ కేవలం ప్రధాని మాత్రమే..!నాయకుడు కాదని ఆయన అన్నారు.