అన్ని రంగాల్లో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. ఈరోజు (శనివారం) ఉదయం వెంకయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. దేశం ఏ రంగంలో అభివృద్ధి చెందిందో ప్రధాని మన్మోహన్ చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వ అవినీతిపై.. బీజేపీ దేశవ్యాప్తంగా 100 ర్యాలీలు చేపట్టబోతోందని వెంకయ్య ప్రకటించారు.
సుప్రింకోర్టు ఇటీవల కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని ఇచ్చిన తీర్పుపై చర్చ జరగాలని యన అబిప్రాయపడ్డారు. కాగా సీబీఐ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థగా మారిందని మరోసారి రుజువైందని… బన్సల్, ములాయం సింగ్ కేసులో ఆ విషయం తేటతెల్లమైందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.