బెజవాడ రౌడీ.. !!

Lagadapati-rajagopalహస్తినాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీ-బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే సమయంలో.. పిప్పర్ స్ప్రే చల్లని ఎంపీ లగడపాటి, సభలోకి కత్తిని తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. వీరిపై చర్యలు వుంటాయని పార్లమెంట్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. అయితే, లగడపాటి బెజవాడ రౌడీలా వ్యవహరించారని టీ-నేతలు ఆరోపిస్తున్నారు. లోక్ సభలో ఈరోజు చోటుచేసుకున్న ఘటనపై పలువురు విచారం వ్యక్తం చేశారు. భాజాపా అగ్రనేత అద్వానీ దురదృష్ట చర్యగా పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఎన్నడు ఇలాంటి ఘటనను చూడలేదని ఆయన అన్నారు. సభ తిరిగి మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం కానుంది.