బీఏసీ సమావేశానికి హాజరుకాని కిరణ్, చంద్రబాబు!!

cm-kiran-chandrababuఈరోజు (సోమవారం) బీఏసీ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు 3గంటల పాటు సాగింది. అయినప్పటికినీ.. విభజన ముసాయిదా బిల్లుపై చర్చ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో.. మధ్యాహ్నం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగిన విధానాని స్వీకర్ సభ్యులకు పంపిచారు. కాగా, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకాలేదు.