Site icon TeluguMirchi.com

కేంద్రానికి బాలయ్య హెచ్చరిక !

Nandamuri-Balakrishna
బాలయ్య రంగంలోకి దిగాడు. ప్రత్యేక హోదాపై కేంద్రానికి బలమైన హెచ్చరికలు జారీ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎవరినీ బతిమాలాల్సిన అవసరం లేదని.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బాలకృష్ణ కేంద్రాన్ని హెచ్చరించారు. తెగే దాకా లాగితే ఎవ్వరికీ మంచిది కాదని పరోక్షంగా భాజాపా – తెదేపా మిత్రబంధాన్ని గుర్తు చేశారు. ఓవైపు కేంద్రన్ని హెచ్చరిస్తూనే.. మరో వైపు ఏపీకి ఇచ్చిన హామీల్ని కేంద్రం నిలబెట్టుకుంటుందనే ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ఈరోజు బాలకృష్ణ మంత్రి అచ్చాన్నాయుడుతో కలసి విశాఖ జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన బాలయ్య కేంద్రానికి తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు.

ఇన్నాళ్లు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఓ మాట అనేందుకు టీడీపీ నేతలు జంకేవారు. అయితే, ఇటీవల రాజ్యసభలో టీడీపీ ఎంపీల వ్యవహార శైలిని తప్పుపట్టిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాపై దూకుడు పెంచాలని సూచించారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలకు, పార్టీ శ్రేణులకి దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలోనే.. బావ చంద్రబాబు సూచనలతో బాలయ్య కేంద్రానికి బలమైన హెచ్చరికలు జారీ చేసినట్టు కనబడుతోంది.

Exit mobile version