నాటకీయ పరిణామాల అనంతరం కోర్టు శనివారం సాయంత్రం సడక్ బంద్ సందర్భంగా అరెస్టయిన 11 మందిలో ఎనిమిదిమందికి బెయిలిచ్చింది. అయితే అరెస్టయిన 11 మందిలో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు కావేటి సమ్మయ్య, గట్టి తిమ్మన్న, తుమ్మల రవికుమార్ లు ఈరోజు ఉదయం కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన ముగ్గురికి కోర్టు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించింది. కాగా, అరెస్ట్ చేసిన 48 గంటలలోపే విడుదల కావడంలో కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ లు సస్పెన్షన్ వేటు నుంచి బయటపడ్డారు.