స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో చంద్రబాబు, కేసీఆర్ లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చంద్రులిద్దరూ.. తమ రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గవర్నర్ చొరవ చూపినట్లు తెలుస్తోంది. దీంతో.. బాబు-కేసీఆర్ లు సమస్యలపై సామరస్యంగా చర్చించుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా.. విద్యత్, స్థానికత, ఫీజు రీయింబర్స్ మెంట్.. తదితర అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించే అవకాశం వున్నట్లు సమాచారమ్. మరీ.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం చంద్రులిద్దరూ.. తీసుకోనున్న తాజా నిర్ణయాలు ఎలా వుండబోతున్నాయి అన్నది పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.