‘భారీ పైలాన్’ ను ఆవిష్కరించిన బాబు !

tdp pailonతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర ముగింపు నేపథ్యంలో.. విశాఖ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు పసుపు రంగుతో.. పరవళ్లు తొక్కుతున్నారు. జిల్లాలో మొత్తం పసుపు మయంగా కనిపిస్తోంది. వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర విజయవంతం అయినందుకు గుర్తుగా విశాఖ పట్నంలోని అగనంపూడి వద్ద 60 అడుగుల ఎత్తున్న భారీ పైలాన్ (విజయస్థూపం)ను ఈ సాయంత్రం బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. అనంతరం బాబు సభాప్రాంగణానికి వెళుతున్నారు. తెలుగు తమ్ముళ్ల హర్షధ్వానాలతో సభాప్రాంగణం మారుమ్రోగిపోతోంది.