ప్రాంతీయ సదస్సు సాక్షిగా.. బాబు తెరాసతో పాటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా వ్యవహరించిన సమయంలో.. ఇక్కడివారికి ఒరిగిందేమీలేదని, బీడీకట్టలపై పుర్రె బొమ్మ ముద్రించడం ద్వారా రాష్ట్రంలోని వేలాది బీడీ కార్మికుల పొట్టగొట్టారని బాబు దుయ్యబట్టారు. హైదరాబాద్ లో వైఎస్ హయాంలో వేలాది ఎకరాలు కొల్లగొడుతుంటే తెరాస ఒక్కమాటా మాట్లాడలేదని బాబు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలలో గెలుపొందేందుకు కార్యకర్తలు కృషి చేయాలని బాబు సూచించారు.