ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు-అరగంట వాయిదా!

assembly sessionమలివిడత శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర నేతలు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దీంతో.. స్వీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు.. వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మాణాలను తిరస్కరిస్తున్నట్లు స్వీకర్ ప్రకటించారు. సమైక్య తీర్మాణం చేయాలని వైకాపా వాయిదా తీర్మాణం ఇచ్చింది. కాగా, టీ-బిల్లుపై చర్చ చేపట్టాలని తెరాస, బీజేపీ, సీపీఐ పట్టుబట్టాలని నిర్ణయించగా, టీ-బిల్లును తిరిగి పంపించాలని సీమాంధ్ర తెదేపా నేతలు, టీ-బిల్లుపై చర్చ చేపట్టే విధంగా ఒత్తిడి తేవాలని టీ-తెదేపా నేతలు, సమైక్య తీర్మాణం చేయాలని వైకాపా నేతలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.