ఉభయ సభలు రేపటికి వాయిదా పడింది. టీ-బిల్లుపై ఉభయ సభల్లో ఈరోజు కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. శాసనసభలో ఈరోజు 32మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే, టీబిల్లుపై చర్చ కొనసాగుతుండగా… చర్చపై గడువును మరింత పెంచాలంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీన్ని తెలంగాణ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో.. ఇరు ప్రాంతా నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో.. సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో.. సభను స్వీకర్ రేపటికి వాయిదా వేశారు. మరోవైపు, శాసన మండలిలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.