Site icon TeluguMirchi.com

మంత్రుల ప్రచారాన్ని తిపికొడదాం..!

ashok babuవిభజన ప్రక్రియ మొదలైందన్న ప్రచారాన్ని కేంద్రమంత్రులు మానుకోవాలని ఎపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ చెప్పారు. కేంద్రమంత్రుల ప్రచారన్ని తిప్పికొడతామని ఆయన అన్నారు. కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దిగ్విజయ్ సింగ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్టికల్ 371డీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా వుంటుందని, తెలంగాణలోని 70శాతం మంది రాష్ట్రం సమైక్యంగానే వుండాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇరు ప్రాంతాల ప్రజలను యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పార్టీలన్నీ.. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి రాష్ట్ర
సమైక్యతకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

Exit mobile version