Site icon TeluguMirchi.com

అన్ని పార్టీలు మద్ద్దతు ప్రకటించాయి : అశోక్ బాబు

ashokbabuఅసెంభ్లీలో టీ-బిల్లును వ్యతిరేకించాలన్న ఏపీ ఎన్జీవోల డిమాండ్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలియజేశారు. ఈరోజు ఉదయం ఏపీ ఎన్జీవో భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం అశోక్ బాబు విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రాంతంలోని..158 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకించాలని నేతలను కోరామని చెప్పారు. అందుకు అన్ని పార్టీల నేతలు కూడా అంగీకరించారని అశోక్ బాబు తెలిపారు. కాగా, రాష్ట్రపతిని కలిసే అంశంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version