ఏపీఎన్జీవోల చీలిక అవాస్తవం : అశోక్ బాబు

ashokbabuరానున్న రోజుల్లో రాజకీయ పార్టీలన్నీ తమ జెండాలను, అజెండాలను పక్కన పెట్టి సమైక్య ఉద్యమంలో కలసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.ఈ నెల 28న మరోసారి అఖిలపక్షంతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. విశాఖ ఆయన మీడియా తో మాట్లాడారు. ఇకపై జరిగే ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులతో కలసి రాజకీయ నేతలు కూడా పాల్గొంటారని వెల్లడించారు.

ఏపీఎన్జీవోలలో చీలిక వచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఏపీఎన్జీవోల ఎన్నికలు ప్రశాంతగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ ఉండటం సాధారణ అంశమని, ఎన్నికల తర్వాత ఎపీఎన్జీవోలందరం కలసి సంఘటితంగా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని అన్నారు. ఎన్నికల ప్రభావం ఉద్యమం పై వుందని, నాయకత్వం మారినా ఉద్యమంలో వెనుకంజ వేయమని వెల్లడించారు.