Site icon TeluguMirchi.com

మంత్రులు, ఎంపీలు రాజీనామాలకు సిద్ధం!

ashok babuరాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.  ఢిల్లీలో సీమాంధ్ర మంత్రలు, ఎంపీలతో తమ భేటీ ముగిసిన సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ లో జరుపనున్న సభకు నైతిక మద్దతు తెలిపారన్నారు. ఉద్యమంలో పాల్గొనే విషయంలో మరో మూడు రోజుల్లో తమ నిర్ణయం చెబుతారన్నారని అశోక్ బాబు వెల్లడించారు.

కాగా ఏపీఎన్జీవోలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఏ రకమైన హామీ ఇవ్వకపోవడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఏపీఎన్జీవోలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి వారు అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని, రాజీనామాల వల్ల ఒరిగేది ఏదీ ఉండదని వారికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ సంధర్భంగా ఎంపీ అనంత మాట్లాడుతూ, ఈ రోజు రేపు చర్చించుకుని రాజీనామాలపై ఒక నిర్ణయానికి వస్తామని, అవసరమైతే రాజీనామాలకు వెనకాడేది లేదని తెలిపారు.

Exit mobile version