కాగా ఏపీఎన్జీవోలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఏ రకమైన హామీ ఇవ్వకపోవడంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఏపీఎన్జీవోలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి వారు అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని, రాజీనామాల వల్ల ఒరిగేది ఏదీ ఉండదని వారికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ సంధర్భంగా ఎంపీ అనంత మాట్లాడుతూ, ఈ రోజు రేపు చర్చించుకుని రాజీనామాలపై ఒక నిర్ణయానికి వస్తామని, అవసరమైతే రాజీనామాలకు వెనకాడేది లేదని తెలిపారు.