సీఎం స్పష్టమైన హామీ ఇస్తే సమ్మె విరమణ

ashok babuసీఎం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సీఎం కిరణ్ తో జరిగిన భేటి అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చే హామీని బట్టే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. రేపు ఏపీఎన్జీవో సమావేశం ఉంటుందని, సీఎంతో చర్చించేబోయే విషయాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తామని వివరించారు. సమ్మె కొనసాగించాలా? వద్దా? అన్న విషయంపైనా చర్చిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా సమ్మె ప్రభావం అలాగే ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై చివరి వరకు పోరాడతామని అశోక్ బాబు స్పష్టం చేశారు.