Site icon TeluguMirchi.com

శాసన సభలో బిల్లు పెట్టడం దురదృష్టకరం: అశోక్ బాబు

ashokbabuఅసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టడం దురదృష్టకరమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.  తెలుగు వారి కోసం పొట్టి శ్రీరాములు త్యాగం చేసిన రోజున బిల్లు ప్రవేశపెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. చాలా దౌర్జన్యంగా, బలవంతంగా శాసనసభలో బిల్లు పెడితే ఇరు ప్రాంతాలకు నష్టమేనన్నారు. డిసెంబర్ 18,19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ఇరు ప్రాంతాలకు న్యాయం చేకూరేలా రాజకీయ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ఎన్జీవో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు. విభజన ప్రక్రియ వల్ల రాష్ట్ర అభివృద్ధి అడుగంటిందని విమర్శించారు.

Exit mobile version