Site icon TeluguMirchi.com

లొంగిపోయిన అసదుద్దీన్

Asaduddin-Owaisiఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు (సోమవారం) సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. 2005లో అప్పటి కలెక్టర్ అనీల్ కుమార్ ను దూషించిన కేసులో ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అయితే అసరుద్దీన్ కు సంగారెడ్డి కోర్టు ఫిబ్రవరి 2వ తేదీ వరకూ రిమాండ్ విధించిందని తెలుస్తోంది. అసదుద్దీన్ కు రిమాండ్ విధించటంతో ఆయనను పోలీసులు సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు అసదుద్దీన్ తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈకేసుపై విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా అసదుద్దీన్ లొంగుబాటుతో హైదరాబాద్ లో హైఅలర్ట్ విధించారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Exit mobile version