Site icon TeluguMirchi.com

‘టీ’.. లో మా మద్దతే కీలకం!

Asaduddin-Owaisiరాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కానేలేదు… అప్పుడు ఏర్పడబోయే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రభత్వం ఏర్పాటు చేయాలంటే మా మద్దతే కీలకమంటున్నారు ఎంఐఎం నేతలు. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు అసరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలంగాణలో మా మద్దతే కీలకమని వ్యాఖ్యానించారు. ప్రసుత రాజకీయ పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంటే.. టీడీపీ అధికార కలలు కంటోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ కీలకంగా మారినా అధికారం కోసం మజ్లిస్ మద్దతు తప్పదన్నాని జోస్యం చెప్పారు. మొత్తానికి.. నయాగా ఏర్పడబోయే రాష్ట్రంపై ఓవైసీ పెద్ద ఆశలే పెట్టుకున్నట్టున్నారు.

Exit mobile version