Site icon TeluguMirchi.com

బలిపశువును చేశారా.. ?

Dharmana-Prasada-Rao-resignజగన్ అక్రమాస్తుల కేసులో వున్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు మంత్రి పదవులకు రాజీనామా చేశారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇప్పటివరకూ.. ఎలాంటి అధికార ప్రకటన వెలువడనప్పటికినీ.. మంత్రులు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించినట్లు సమాచారం. ధర్మాన రాజీనామా చేశారన్న వార్తల నేపథ్యంలో.. ఈరోజు (సోమవారం) ఉదయం మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, వట్టి వసంతకుమార్ తదితరులు ఆయనను కలిశారు. తనను బలిపశువును చేశారంటూ.. మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయం శిరసావహించి పార్టీకి సేవచేస్తానని ధర్మాన పేర్కొనట్లు సమాచారం. అయితే, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న ఇతర వ్యవహారాలతో పోలీస్తే… తనది పూర్తిగా భిన్నమైన కేసని ధర్మాన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ ఫైలు కూడా తన వద్ద ప్రారంభం కాలేదని, తన వద్ద ముగియలేదని, అంతా మంత్రివర్గమే చూసుకుందని ధర్మాన వాపోయినట్లు సమాచారం.

 

Exit mobile version