ప్రభుత్వ ఏర్పాటుకు ’ఆమ్ ఆద్మీ’ రెడీ.. !

AAPఢిల్లీ లో ప్రభుత్వ ఏర్పాటుకు ’ఆమ్ ఆద్మీ పార్టీ’ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత క్రేజివాల్ ఓ ప్రకటన చేశారు. అయితే,  ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. గతంలో దేశ రాజధానిలో ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన బీజేపీ, కాంగ్రెస్ కంటే సరైన పాలనను అందిస్తామని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు గానూ ఏపీపీకి కాంగ్రెస్, భాజాపాలు రెండు కూడా మద్దతిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఏపీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ మద్దతును తీసుకుంటుందా.. ? లేదా.. బీజెపీ మద్దతును తీసుకుంటుందా.. ? అన్నది ఆసక్తిగా మారింది.