సమైక్యరాష్ట్రం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతున్న ఏపిఎన్జీవోలో చీలికలు మొదలయ్యాయి. సమైక్య ఉద్యమాన్ని తానే నడిపిస్తోన్నట్టు బిల్డప్ ఇస్తోన్న ఏపిఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు… సొంత సంస్థలోని సభ్యులనే కలుపుకోలేక పోతున్నారు. అశోక్బాబు ఒంటెత్తు పోకడలకు విసుగు చెందిన ఏపిఎన్జీవో జిల్లా నాయకత్వం… ఈ సమైక్య చాంపియన్కు ఎసరు పెడుతోంది. రానున్న ఏపిఎన్జీవో ఎన్నికల్లో అశోక్బాబు టీమ్ను గద్దె దించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తుంది.