ఏపీ ఎన్జీవోల నిరవధిక సమ్మె !

apngo-ఏపీ ఎన్జీవోల నిరవధిక సమ్మె సరైన్ మ్రోగింది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఈ నెల 12నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఏపీఎన్జీవో నేతలు వెల్లడించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి నోటీసు ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే.. ముందుగా నష్టపోయేది ఉద్యోగులు, విద్యార్థులేనని ఉద్యోగ నేతలు అంటున్నారు. ఏపీ ఎన్జీవో చేపట్టే సమ్మెకు హైదరాబాద్ లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గతంలో.. ప్రత్యేక తెలంగాణ కోసం టీ-ఎన్జీవోలు సకల జనుల సమ్మె చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు అదే తరహాలో ఏపీ ఎన్జీవోలు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.