సమ్మె పిటిషన్ పై విచారణ వాయిదా !

High-Court-Of-Andhra-Pradeshఏపీ ఎన్జీవోలు సమ్మె పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సమ్మె చట్టవిరుద్దమని హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ గత మూడు రోజులుగా విచారణ కొనసాగుతూనే వుంది. విచారణలో భాగంగా న్యాయస్థానం..సమ్మెపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేపటితో విచారణ ముగిసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోర్టు తీర్పు ఎలా వున్నా సమ్మెను కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేస్తున్నారు.