చర్చలు విఫలం.. సమ్మె యధాతథం !

apngosఏపీ ఎన్జీవోలతో మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో.. ఏపీఎన్జీవోలు చేపట్టిన నివరధిక సమ్మె ఇంకా కొనసాగనుంది. చర్చల అనంతరం సీమాంధ్ర ఉద్యోగులు మంత్రి ఆనంను అడ్డుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీ బ్లాక్ లో నిరసనకు దిగారు. సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే, వీరికి ధీటుగా తెలంగాణ ఎన్జీవోలు జై తెలంగాణ నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.