విభజన పై నిర్ణయం రాష్ట్రంలోనే జరగాలి : జేపీ

jpరాష్ట్ర విభజనకు సంబంధించిన నిర్ణయాలను కేంద్రంలో కాదని, రాష్ట్రంలోనే జరగాలని అన్నారు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. జేపీ తో ఈరోజు ఏపీఎన్జీవోలు సమావేశమై అసెంబ్లీలో బిల్లు విషయమై చర్చలు జరిపారు. ఏపీఎన్జీవోలు తనను కలిసిన అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని… రానున్న శాసనసభ సమావేశాల్లో తమ వాణి వినిపిస్తామని జె.పీ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు…వలస పాలనను తలపిస్తోందని విమర్శించారు.