ఎన్ని ఇబ్బందులెదురైన ఉద్యమం ఆగదు !

ashok babuతన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు, కొందరు తెలంగాణ వాదులు వక్రీకరించారని అన్నారు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. హిందూపురం సభలో తన వ్యాఖ్యల పట్ల వచ్చిన స్పందనలపై ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదని, దానిపై చర్చకు సిద్ధమని తెలిపారు. తన నాలుక కోస్తామని, ఏపీఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని కొందరు హెచ్చరికలు జారీ చేశారని.. ఆ హెచ్చరికలు సమస్యకు పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. నాలుక కోసినా, చేతులు, కాళ్ళు తెగనరికినా.. ఉద్యమం ఆపేదిలేదని స్పష్టం చేశారు. ఎవరెన్ని రకాలు ఇబ్బందులు పెట్టినా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేటు పాఠశాలలను సైతం మూసివేయాలని ఆయన సూచించారు.