Site icon TeluguMirchi.com

ఏపీ ఎన్జీవోల భవిష్యత్ కార్యాచరణ ఖరారు !

apngosసమైక్య ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసే దిశగా ఏపీ ఎన్జీవోలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈరోజు నుండి ఈ నెల 12 వరకు సీమాంధ్రలో గ్రామ జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు అవగాహన సదస్సులు, 13న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు, 14న మహిళా ఉద్యోగుల ర్యాలీ, 15న ఏపీ ఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం, 16న సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక విస్తృత స్థాయి సమావేశం, ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేపట్టాలని ఏపీ ఏన్జీవోలు నిర్ణయించినట్లు సమాచారం.

Exit mobile version