Site icon TeluguMirchi.com

అర్థ రాత్రి నుంచి సమ్మె స్టార్ట్ !

apngosసీమాంధ్ర ఎన్జీవోల నిరవధిక సమ్మె అర్థ రాత్రి నుంచి కొనసాగనుంది. సమ్మెను వాయిదా వేసే ప్రసక్తే లేదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక సంఘాలు ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు అందజేశాయని వెల్లడించారు. తెలంగాణ ప్రజల “సకల జనుల సమ్మె” రాష్ట్ర విభజనకు నాందిపలికిందని, అదే తరహాలో ఇప్పడు ఏపీ ఎన్జీవోల నిరవధిక సమ్మె ద్వారానే విభజనకు పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నామని అశోక్ వెల్లడించారు. శాంతియుతంగా చేపట్టే నిరసనలకు ప్రభుత్వం సహకరించాలని ఆయన అన్నారు. దాదాపు నాలుగున్నర లక్షలకు పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అశోక్ బాబు తెలిపారు.

Exit mobile version