Site icon TeluguMirchi.com

‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు లక్షమంది: ఏపీ ఎన్జీవో

apngosసమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎల్బి స్టేడియంలో ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్’ గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు లక్షకు పైగా ఆంధ్రులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని వివిధ కాలనీల వాసులు, జంటనగరాల ప్రజలు, ఉద్యోగులు సభపట్ల ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.

సమైక్యరాష్ట్రంకోరుకునే ప్రతిఒక్కరూ ఈ సభకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజకీయ అజెండా లేకుండావస్తే పార్టీ నేతలనూ ఆహ్వానిస్తామని అశోక్‌బాబు చెప్పారు. అయితే సభ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. సభా అనుమతిపై రేపు పోలీసులు చెప్పకుంటే కోర్టును ఆశ్రయించే యోచన లో ఏపీ ఎన్జీవోలు వున్నారు.

Exit mobile version