హోదా కోసం ఢిల్లీ లో అధికార , ప్రతిపక్షాల ధర్నాలు..

ap-special-status-dharna-inఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం అధికార , ప్రతిపక్షాలు ఢిల్లీ లో పోటాపోటీగా ధర్నాలకు దిగాయి. మంగళవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మొదటగా టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. తెలుగుదేశం ఎంపీ శివ ప్రసాద్ వివేకానంద గెటప్ తో వినూత్నంగా తన నిరసన తెలిపాడు. ఆ తర్వాత వైసీపీ ఎంపీలు అందరూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి సభలోకి వెళ్లారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.