ఇప్పటికే రేణిగుంట నుంచి ఢిల్లీకి ఏపీఎన్జీవోల ప్రత్యేకరైలు బయలుదేరింది. మధ్యాహ్నం ఒంటిగంటకు అనంతపురం నుంచి, 2 గంటలకు కాకినాడ నుంచి, 4 గంటలకు నెల్లూరు నుంచి, 8 గంటలకు గుంటూరు, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ఛలో ఢిల్లీకి వెళ్లే వారిలో విద్యార్థులు, యువకులే అధికం. రాష్ట్ర విభజనను ఆపడానికే ఢిల్లీ వెళ్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. మరీ.. వీరి ప్రయత్నలు ఎంత వరకు ఫలిస్తాయో………