Site icon TeluguMirchi.com

ఆపడానికే.. ‘చలో ఢిల్లీ’ !

apngo(1)ఏపీఎన్జీవోల ‘చలో ఢిల్లీ’ పిలుపు మేరకు భారీ సంఖ్యలో సమైక్య వాదులు ఢిల్లీ చేరుకుంటున్నారు. ఈ నెల 17,18వ తేదీల్లో ఏపీ ఎన్జీవోలు ఢిల్లీలో భారీ బహిరంగ సభలకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు రాష్ట్రం నుండి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే రేణిగుంట నుంచి ఢిల్లీకి ఏపీఎన్జీవోల ప్రత్యేకరైలు బయలుదేరింది. మధ్యాహ్నం ఒంటిగంటకు అనంతపురం నుంచి, 2 గంటలకు కాకినాడ నుంచి, 4 గంటలకు నెల్లూరు నుంచి, 8 గంటలకు గుంటూరు, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ఛలో ఢిల్లీకి వెళ్లే వారిలో విద్యార్థులు, యువకులే అధికం. రాష్ట్ర విభజనను ఆపడానికే ఢిల్లీ వెళ్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. మరీ.. వీరి ప్రయత్నలు ఎంత వరకు ఫలిస్తాయో………

Exit mobile version