Site icon TeluguMirchi.com

బిల్లును భోగి మంటల్లో తగలబెడతాం !

t billఈ నెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగులబెట్టే కార్యక్రమాన్ని ఈ నెల 13న నిర్వహిస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని నేతలు ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులదేనని అశోక్ బాబు అన్నారు. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చించాలని, ఓటింగ్ సమయంలో ఓడించాలని అన్నారు.

Exit mobile version